కావలసిన పదార్థాలు : మిల్క్క్రీమ్ (మిల్క్మెయిడ్)... 400 గ్రా. పంచదార... 400 గ్రా. వెన్న... 400 గ్రా. తేనె... 400 గ్రా. రంగు కాగితం... తగినంత
తయారీ విధానం : అడుగు మందం ఉన్న గిన్నెలో మిల్క్మెయిడ్, పంచదార, వెన్న కలిపి సన్నని మంటమీద చెక్క స్పూనుతో బాగా కలియబెట్టి చిక్కటిపాకం వచ్చేవరకూ తిప్పాలి. ప్లేటులో కాసిని నీళ్లు పోసి అందులో పాకం ఓ చుక్క వేసి చూడాలి. పాకం ఉండలా అయితే గట్టిపడినట్లే. ఇప్పుడు ఓ ప్లేటుకి నెయ్యి రాసి అందులో ఈ పాకం వేసి కాస్త వేడిగా ఉండగానే ముక్కలుగా కోసి రంగుకాగితంతో చుట్టాలి. కాసేపటికి అవి గట్టిపడి తినడానికి బాగుంటాయి.