కాకరకాయ వండుతున్నారా? రెండు పచ్చి మామిడి ముక్కలు వేస్తే..!?

గురువారం, 30 ఏప్రియల్ 2015 (20:00 IST)
కాకరకాయంటే చేదు తినను బాబోయ్ అంటూ భయపడిపోతున్నారా.. అయితే కాకరకాయ కూర వండేటప్పుడు వీలైతే అందులో రెండు పచ్చి మామిడి కాయ ముక్కలు వేయండి. చేదు తగ్గడమే కాదు, కూరకు కొత్త రుచి వస్తుంది. అలాగే క్యారెట్‌తో ఏ కూర చేసినా, అది ఉడికే సమయంలో కాస్తంత పంచదార వేయండి  టేస్ట్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. 
 
క్యారెట్ హల్వా తయారయ్యాక దానికి కొద్దిగా బియ్యపు పిండి కలపండి. కేరెట్ హల్వా మంచి రుచిగా ఉంటుంది. కుక్కర్‌‌లో పప్పు ఉడికించినప్పుడు ఒక్కోసారి పప్పులో నీరు ఎక్కువైపోతుంది.

ఆ వేడి వేడి పప్పుతేరును చపాతి పిండిలో పోసి నానబెడితే పప్పులో ఉన్న పోషకవిలువలు వృధాకావు, చపాతీలు మృదువుగా వస్తాయి. కూరగాయలు ఉడికించేటప్పుడు కొంచెం నిమ్మరసం చల్లితే రంగు మారకుండా ఉంటాయి. సూపుల్లో కొన్ని చుక్కల నిమ్మరసం వేస్తే మంచి రుచి వస్తుంది.

వెబ్దునియా పై చదవండి