దేశంలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (14:22 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 20 వేలకు దిగువకు చేరుకున్నాయి. మంగళవారం కేంద్ర వైద్య ఆరోగ్యం శాఖ వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 18,795 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 
 
దీంతో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,36,97,581కు చేరింది. గడచిన 24 గంటల్లో 26,030 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య‌ 32,9,58,002కు చేరింది. 
 
అదేవిధంగా 24 గంటల్లో 179 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,47,373కు చేరింది. 2,92,206 మంది ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స అందుతోంది. 
 
మ‌రోవైపు, కేర‌ళ‌లో కొత్తగా 11,699 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న 58 మంది మృతి చెందారు. నిన్న రికార్డు స్థాయిలో 1,02,22,525 మందికి వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 87,07,08,636 వ్యాక్సిన్ డోసుల‌ను వినియోగించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు