ఆస్ట్రేలియా, భారత్ మధ్య గురువారం జరిగే ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠను రేపుతున్న సమయంలో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ సిడ్నీ చేరుకుంది. మార్చి 26వ తేదీన టీమిండియా సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. తన చెలికాడు విరాట్ కోహ్లీ ఆడుతున్న మ్యాచ్ను కనులారా తిలకించేందుకే అక్కడకు వెళ్ళింది.
ఇదిలావుంటే, జీవిత భాగస్వాములు, ప్రియురాళ్లతో కలిసే విషయంపై ఉన్న నిషేధాన్ని, టీమిండియా నాకౌట్కు అర్హత సాధించడంతో బీసీసీఐ ఎత్తివేసింది. దీంతో పెళ్లైన క్రికెటర్లు భార్యలతో, పెళ్లి కాని ప్రసాదులు ప్రియురాళ్లతో కలిసే అవకాశం చిక్కింది.