వరల్డ్ కప్ : ఐర్లాండ్‌కు కళ్లెం వేసిన ఇంగ్లండ్ .. 119 రన్స్‌తో విజయం!

సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (13:24 IST)
వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో క్రికెట్ పసికూన ఐర్లాండ్ జట్టుకు ఇంగ్లండ్ కళ్లెం వేసింది. వెస్టిండీస్ జట్టుకు షాకిచ్చిన ఐర్లాండ్ జట్టుకు మంగళవారం ఇంగ్లండ్ బ్రేకులు వేసింది. మంగళవారం జరిగిన లీగ్ పోటీలో ఇంగ్లండ్ జట్టు స్కాట్లాండ్‌పై 119 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
 
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు... నిర్ణీత 50 ఓవర్లలో 303 పరుగులు చేసింది. ఓపెనర్లు మొయిన్ అలీ (128) సెంచరీతో, ఇయాన్ బెల్ (52) అర్థ సెంచరీతో చెలరేగడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. 
 
ఆ తర్వాత 304 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు 42.2 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ కైలీ కొయెట్జర్ (77) అర్థ సెంచరీలో ఒంటరి పోరు సాగించినప్పటికీ.. ఇంగ్లండ్ చేతిలో ఓటమి తప్పలేదు. 

వెబ్దునియా పై చదవండి