టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 201 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఇంగ్లండ్కు నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ ఆదిలో కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ విజయాన్ని కైవసం చేసుకుంది. ఒక దశలో 90 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను జేమ్స్ టేలర్(82), బట్లర్(67 )లు ఆదుకున్నారు.
చివరికి ఒత్తిడిని జయించి టేలర్, బట్లర్ జట్టును గెలిపించారు. 190 పరుగుల వద్ద జేమ్స్ టేలర్, 193 పరుగుల వద్ద బట్లర్లు పెవిలియన్ కు చేరినా.. అప్పటికే ఇంగ్లండ్ విజయం ఖాయమైంది.