ఫ్రీడమ్ సిరీస్లో భాగంగా మెరుగ్గా రాణించలేకపోవడంతో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వంటీ-20ల్లో టాప్ ర్యాంకును కోల్పోయాడు. టీమిండియా చెత్త ప్రదర్శనతో ట్వంటీ-20 సిరీస్ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. డ్యాషింగ్ బ్యాట్స్మన్గా జట్టుకు వెన్నెముకగా నిలుస్తాడనుకున్న కోహ్లీ, ధర్మశాలలో జరిగిన తొలి మ్యాచ్లో మెరుగ్గానే రాణించినా, కటక్లో జరిగిన రెండో వన్డేలో సింగిల్ పరుగుకే వెనుదిరిగాడు.
ఇదిలా ఉంటే, అలాగే జట్టు ర్యాంకింగ్స్లో టీమిండియా కూడా నాలుగో స్థానం నుంచి ఏకంగా ఆరో ర్యాంకుకు పడిపోయింది. సఫారీ జట్టు ఓ స్థానం మెరుగుపరచుకుని ఐదో ర్యాంకుకు చేరుకుంది. శ్రీలంక అగ్రస్థానంలో కొనసాగుతోంది.