ఈ నేపథ్యంలో ముగ్గురు ఐపీఎల్ ఆటగాళ్లు సురేష్ రైనా, రవీంద్ర జడేజా, బ్రావోలు బెట్టింగ్కు సహకరించినట్లు లలిత్ మోడీ తమకు మెయిల్ పంపిన మాట వాస్తవమేనని ఐసీసీ ఒప్పుకుంది. ఈ సమాచారాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగాగానికి పంపడంతో పాటు.. బీసీసీఐ అవినీతి నిరోధక అధికారులకు కూడా సమాచారాన్ని చేరవేశామన్నారు. అయితే, వారేమి చర్యలు తీసుకున్నారన్న విషయంపై తమకు తిరిగి సమాచారం రాలేదని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.