రాజ్కోట్ మూడో వన్డే మ్యాచ్లో తమ మద్దతుదారులు కొందరు రిజర్వేషన్లు కోరుతూ ప్లకార్డులు చూపుతారని పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ ప్రకటించిన నేపథ్యంలో.. అప్రమత్తమైన ఎస్సీఏతో పాటు క్రికెటర్లు, అభిమానులు మ్యాచ్కు ఆటంకం కలిగించవద్దని హార్దిక్ను వేడుకున్నారు.
హార్దిక్ను కలిసి మూడో వన్డేకు అంతరాయం కలిగించకుండా ఉండాలని కోరుతామని యువక్రికెటర్లు కొందరు తమ కోచ్ను అడిగారని, దానికి ఆయన అంగీకరించినట్టు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎస్సీఏ) మీడియా మేనేజర్ హిమాంశు వెల్లడించారు.