భారత క్రికెట్ జట్టుకు కోచ్ దండగ : కపిల్ దేవ్ కామెంట్స్

శుక్రవారం, 29 మే 2015 (12:33 IST)
భారత క్రికెట్ జట్టుకు కోచ్ దండగ అని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నారు. వాస్తవానికి ప్రస్తుత కోచ్ డంకెన్ ఫ్లెచర్ వారసుడు ఎవరన్న దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి. ఇదే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ మాత్రం అసలు భారత జట్టుకు కోచ్ ఎందుకు? అని ప్రశ్నింశారు. 
 
టీమిండియాలో స్టార్లు ఉండగా కోచ్‌తో పనేంటని, ధోనీ, కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లే జట్టును నడిపించగలరన్నారు. జట్టులో ఉన్న యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేయగలిగితే చాలన్నారు. టీమిండియా కోచ్ కోసం బీసీసీఐ టైమ్ వేస్ట్ చేస్తోందని విమర్శించాడు. బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే టీమిండియాకు ప్రధాన కోచ్‌గా ఎవరిని నియమిస్తారన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. 

వెబ్దునియా పై చదవండి