డిసెంబర్ 15వ తేదీ నుంచి శ్రీలంక వేదికగా పాకిస్థాన్-భారత్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని బీసీసీఐ సీనియర్ అధికారి రాజీవ్ శుక్లా వెల్లడించారు. ముంబై దాడులకు తర్వాత దాయాది దేశాల మధ్య క్రికెట్ సిరీస్కు సుదీర్ఘ బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో పలు చర్చలు, సమావేశాల అనంతరం శ్రీలంక వేదికగా సిరీస్ నిర్వహణకు రెండు దేశాలు అంగీకారం తెలిపాయి.
ఈ సిరీస్పై పాకిస్థాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ నుంచి పీసీబీ అనుమతి పొందడం కూడా పూర్తయ్యిందని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. ఇక భారత ప్రభుత్వం నుంచి మాత్రమే అనుమతి లభించాల్సి వుందని.. ఆ పర్మిషన్ దక్కితే వెంటనే ఆ సిరీస్ ప్రారంభమవుతుందన్నారు. అంతా ఓకే అయితే వచ్చేనెల 15 నుంచి సిరీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.