భారత్-దక్షిణాఫ్రికాల మధ్య మొహాలీలో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ సేన జయకేతనం ఎగురవేసింది. వన్డే, ట్వంటీ-20 సిరీస్లో మెరుగ్గా రాణించలేకపోయిన భారత్.. తొలి టెస్టులో నిలకడగా ఆడుతూ.. సఫారీల బ్యాటింగ్, బౌలింగ్కు అడ్డుకట్ట వేయగలిగింది. టీమిండియా బ్యాట్స్మెన్లు సైతం బాధ్యతాయుతంగా ఆడటంతో తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. విజయం టీమిండియాను వరించింది.
ఇక అమిత్ మిశ్రా, వరుణ్ చెరో వికెట్ను పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్లో 218 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 39.5 ఓవర్లలో 109 పరుగులు మాత్రమే చెయ్యగలిగింది. స్పిన్నర్ల అద్భుత బౌలింగ్తో భారత్ తొలి టెస్టు గెలుపుతో శుభారంభం చేసింది.