ఐపీఎల్ 2015 షెడ్యూల్ విడుదల: 3 మ్యాచ్‌లు వైజాగ్‌లో..

బుధవారం, 11 ఫిబ్రవరి 2015 (19:21 IST)
ఐపీఎల్ 2015 షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. ఇందులో భాగంగా మూడు ఐపీఎల్ మ్యాచ్‌లకు వైజాగ్ వేదిక కానుంది. తాజా సీజన్ ఏప్రిల్ 8న ప్రారంభం కానుండగా, ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంప్ కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. 
 
సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు ఆడనున్న మూడు మ్యాచ్‌లను విశాఖలో జరగనున్నాయి. మే 24న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈవెంట్ ముగుస్తుంది. గత సీజన్‌లో షారూఖ్ ఖాన్ కు చెందిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి