ఐపీఎల్ 2015 షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. ఇందులో భాగంగా మూడు ఐపీఎల్ మ్యాచ్లకు వైజాగ్ వేదిక కానుంది. తాజా సీజన్ ఏప్రిల్ 8న ప్రారంభం కానుండగా, ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంప్ కోల్కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.