టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్కు మళ్లీ చిక్కులు తప్పేలా లేవు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుల్లో చిక్కుకుపోయిన శ్రీశాంత్ కష్టాలను కొనితెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఐపీఎల్లో ఫిక్సింగ్కు పాల్పడిన శ్రీశాంత్, చండీలా, అంకిత్ చవాన్ను క్రీడాభిమానులను నివ్వెరపరిచారు. దీనిపై తొలుత విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ కోర్టు ముగ్గురు క్రికెటర్లను నిర్దోషులుగా ప్రకటించింది.