ఉమేష్ యాదవ్ స్థానంలో ఇషాంత్ శర్మ: నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్

శుక్రవారం, 13 నవంబరు 2015 (12:54 IST)
ఇషాంత్ శర్మపై ఉన్న ఒక టెస్టు నిషేధం కూడా ముగిసిన నేపథ్యంలో.. భారత్-దక్షిణాఫ్రికాల మధ్య శనివారం ప్రారంభం కానున్న రెండో టెస్టులో ఉమేష్ యాదవ్ స్థానంలో ఇషాంత్ శర్మను ఎంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నెట్స్‌లో ఇషాంత్ శర్మ చెమటోడ్చి గెలిచాడు. దీంతో కొత్త బంతిని ఇషాంత్, వరుణ్ అరోన్‌లు పంచుకుంటారని తెలిసింది. 
 
మరోవైపు దక్షిణాఫ్రికా స్పీడ్ స్టర్ స్టెయిన్ రెండో టెస్టులో ఆడే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. తొలి టెస్టులో కండరాల నొప్పితో బాధపడిన స్టెయిన్ ఫిట్ నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంది. స్టెయిన్ జట్టులో ఉంటాడా? లేదా? అనే విషయంపై కెప్టెన్ డీవిలియర్స్ కూడా అనుమానాస్పదంగానే సమాధానమిచ్చాడు. స్టెయిన్ తన ఫిట్ నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి