కాగా బీసీసీఐ ఎన్నికలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ క్యాంప్కు చెందిన అనురాగ్ ఠాకూర్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అయితే దాల్మియా, ఠాకూర్ కలసి పని చేస్తారా? అనే అనుమానం తలెత్తుతోంది. "ఇదేమి సమస్య కాదు. భారత క్రికెట్ అభ్యున్నతి కోసం ఓ జట్టుగా మేము కలసి పనిచేస్తాం" అని దాల్మియా అంటున్నారు.