వచ్చే ప్రపంచ కప్ నాటికి భారత జట్టు సారథిగా విరాట్ కోహ్లీ ఉండవచ్చునని స్పిన్ దిగ్గజం ఎర్రబెల్లి ప్రసన్న అన్నారు. విరాట్ కోహ్లీ భారత క్రికెట్ జట్టుకు భావి కెప్టెన్ అని, ఇలాంటప్పుడు అతను జట్టు పైన ఎక్కువ బాధ్యత కలిగి ఉండాలని ఎర్రబెల్లి ప్రసన్న సూచించారు.
ఆటలో దూకుడును తప్పుపట్టాల్సింది లేదన్నారు. అయితే, సంయమనం ముఖ్యమని ప్రసన్న అభిప్రాయపడ్డారు. కోహ్లీ మంచి ఆటగాడన్నారు. ప్రత్యర్థి జట్టును గౌరవించాలన్నారు. మనం ఎల్లప్పుడూ బౌలర్ల పైన పై చేయి సాధించకపోవచ్చునన్నారు. ఆత్మవిశ్వాసంతో ఆడటం చాలా అవసరమని, అయితే ఇతర ఆటగాళ్లను గౌరవించాలన్నారు. అతను ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టుమ్యాచుల్లో బాగా ఆడాడన్నారు.