ఐసీసీ అండర్-19: భారత స్కోర్ 349.. సత్తా చాటిన యువ క్రికెటర్లు!

శనివారం, 6 ఫిబ్రవరి 2016 (13:06 IST)
ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్‌లో భారత యువ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. శనివారం నమీబియా జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో యువ క్రీడాకారులు సత్తా చాటారు. నిర్ణీత 50 ఓవర్లలో ఆ వికెట్ల నష్టానికి 349 పరుగులు సాధించింది. ముఖ్యంగా టాపార్డర్ బ్యాట్స్ మెన్లు సంయుక్తంగా రాణించడంతో భారీ స్కోరు సాధించారు. ఈ క్రమంలో ఓపెనర్ ఆర్ ఆర్ పంత్(111), సర్ఫరాజ్ ఖాన్ (76), అర్మాన్ జాఫర్ (64)లు రాణించారు. 
 
అన్మోల్ ప్రీత్ సింగ్ 41, లోమ్రోర్ 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. అటు నమీబియా బౌలర్ కోయెట్టీ మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తదనంతరం 350 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన నంబియా జట్టులో ఓపెనర్లు లాఫ్టీ-ఈటో (17), డేవిన్ (21)లు క్రీజులో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి