భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీ గులాబీ బంతి విసిరాడు. కొత్తగా క్రికెట్లో ప్రవేశపెట్టాలని భావిస్తూ, తయారు చేయించిన గులాబీ రంగులోని బంతిని ధోనీ పరిశీలించాడు. త్వరలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్లో ఈ బంతులను వాడాలన్న నిర్ణయంపై క్రికెట్ ప్రపంచంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ధోనీ కూడా ఈ బంతిని విసిరి పరిశీలించాడు.