ఫ్రీడమ్ సిరీస్లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 12 పరుగులకే సాధించాడు. తద్వారా బ్యాటింగ్లో విఫలమైన కోహ్లీ.. ఫీల్డింగ్లో మాత్రం సఫారీలకు చుక్కలు చూపించాడు. ఒంటి చేత్తో మూడు క్యాచ్లు పట్టి ముగ్గురు కీలక బ్యాట్స్మెన్ను పెవిలియన్ చేర్చాడు. భీకర ఫామ్లో ఉన్న సఫారీ కెప్టెన్ డివిలియర్స్, డూప్లెసిస్, స్టెయిన్స్ల క్యాచ్లను పట్టి జట్టుకు కోహ్లీ తన వంతు సహకారం అందించాడు. కోహ్లీ మెరుపు వేగంతో కదిలి పట్టిన తొలి రెండు క్యాచ్లు మ్యాచ్ ను భారత్ వైపు తిప్పేశాయి.
బుధవారం ఇండోర్లో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ వీర విహారం చేశాడు. కొత్త కుర్రాడు అక్షర్ పటేల్ బంతితో మాయాజాలం చేశాడు. వెరసి ఓడిపోతుందనుకున్న మ్యాచ్లో టీమిండియా అనూహ్య విజయాన్ని అందుకుంది. టీమిండియా విజయానికి ధోనీ, అక్షర్ పటేల్లతో పాటు కోహ్లీ కూడా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడని చెప్పవచ్చు.