వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్తో గురువారం జరిగిన మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. మహ్మద్ షమీ వేసిన 17వ ఓవర్లో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ మహ్మదుల్లా (21) భారీ షాట్ ఆడాడు. ఫోర్ లైన్ దగ్గర ఉన్న ధావన్ గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించాడు.
అయితే ఆ సమయంలో చేతిలో నుంచి జారిన బంతిని చాకచక్యంగా పట్టాడు. బ్యాలెన్స్ కోల్పోయిన ధావన్ బౌండరీ లైన్ను తాకి అవతలకు వెళ్లాడు. ధావన్ వెంటనే బంతిని గాల్లోకి ఎగరేసి మళ్లీ మైదానంలోకి వచ్చి క్యాచ్ పట్టాడు. థర్డ్ ఎంపైర్ మహ్మదుల్లా అవుటైనట్లు ప్రకటించాడు. దీంతో బంగ్లాదేశ్ 73 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.