అయితే అంబటి రాయుడి సూపర్ ఇన్నింగ్స్తో చివరకు టీమిండియానే గెలుపును నమోదు చేసుకుంది. అంత ఒత్తిడిలోనూ కుర్రాళ్లు బాగానే ఆడారంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వారిలో ఈ తరహా నైపుణ్యం పెంపొందడానికి కారణమేంటని అంతా ఆరా తీస్తుంటే, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్న రాయుడు సూటి సమాధానం చెప్పేశాడు.