పాకిస్థాన్లో ప్రపంచ క్రికెట్ జట్లు పర్యటించడం ఆపేశాయి. శ్రీలంక క్రికెటర్లపై జరిపిన కాల్పులకు అనంతరం పాక్కు క్రికెటర్ల టూర్ నిలిచిపోయింది తాజాగా పాకిస్థాన్లో జింబాబ్వే జట్టు పర్యటిస్తోంది. ఆరేళ్ల విరామం తరువాత పాకిస్థాన్లో పర్యటిస్తున్న తొలి విదేశీ జట్టు జింబాబ్వే కావడంతో వారికి వీవీఐపీ ట్రీట్మెంట్ లభిస్తోంది. పటిష్ట భద్రత మధ్య జింబాబ్వే ఆటగాళ్లను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఉంచుతోంది.