క్రికెటర్లకు గ్రహణం.. గాయపడిన మరో బెంగాల్ క్రికెటర్..!

మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (18:58 IST)
క్రికెటర్లకు గ్రహణం పట్టినట్టుంది. తమ క్రీడతో అభిమానులను అలరించే క్రికెటర్లు మృత్యువాతపడుతున్నారు. యువ క్రికెటర్ అంకిత్ కేసరి మరణవార్త మరువకముందే మరో క్రికెటర్ గాయపడిన వార్త వెలుగులోకి వచ్చింది. బెంగాల్ కే చెందిన రాహుల్ ఘోష్ అనే యువ క్రికెటర్ కు లీగ్ క్రికెట్ లో ఆడుతుండగా తలకు బలమైన గాయమైంది. 
 
రాహుల్ ఘోష్ మంగళవారం ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో, అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు చికిత్స అందుకున్న వైద్యులు మాట్లాడుతూ.. ఘోష్   తలకు ఎడమవైపున తీవ్రమైన గాయం ఏర్పడిందని తెలిపారు. 
 
సీటీ స్కాన్‌లో రక్తం గడ్డకట్టినట్టు తేలిందన్నారు. ప్రస్తుతం ఘోష్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయినప్పటికీ వారం రోజుల పాటు పరిశీలనలో ఉంచుకుని వైద్యం అందించాల్సి ఉందని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి