భారత క్రికెట్ జట్టు డైరక్టర్‌ రవిశాస్త్రి పదవీ కాలం పొడగింపు : బీసీసీఐ

ఆదివారం, 13 సెప్టెంబరు 2015 (17:23 IST)
భారత క్రికెట్ జట్టు డైరక్టర్ పదవిని మరో యేడాది కాలం పెంచుతూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం అధికారంగా ప్రకటించింది. అలాగే, ఇప్పట్లో టీమిండియాకు కొత్త కోచ్ నియామకం కూడా లేదని తేల్చి చెప్పింది. టీమిండియా కోచ్‌గా డెంకన్ ఫ్లెచర్ రాజీనామా చేసిన తర్వాత కొత్త కోచ్‌ను ఎంపిక చేయని విషయం తెల్సిందే. 
 
మరోవైపు.. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీ మధ్య మంచి అవగాహన ఉందని, కొత్త కోచ్‌ను నియమిస్తే, అవగాహన లోపంతో టీమిండియా ఇబ్బందుల్లో పడే అవకాశముందని భావించిన బీసీసీఐ, రవిశాస్త్రిని మరో ఏడాది పాటు డైరెక్టర్‌గా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో టీమిండియాకు కోచ్ కమ్ డైరెక్టర్‌గా రవిశాస్త్రి మరో ఏడాదిపాటు కొనసాగుతారు.

వెబ్దునియా పై చదవండి