రిషబ్ పంత్‌కు కరోనా నెగెటివ్ : జట్టులో చేరిన వికెట్ కీపర్

గురువారం, 22 జులై 2021 (12:29 IST)
భారత క్రికెట్ జట్టు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో మ‌ళ్లీ టీమిండియాతో చేరాడు. ఈ నెల 8న క‌రోనా బారిన ప‌డిన అత‌డు.. 10 రోజుల పాటు ఐసోలేష‌న్‌లో ఉన్న విషయం తెల్సిందే. 
 
ఆ త‌ర్వాత నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో నెగ‌టివ్‌గా తేల‌డంతో అత‌డు టీమ్‌ బ‌యో బ‌బుల్‌లోకి వెళ్లాడు. ఈ విష‌యాన్ని గురువారం ఉద‌యం ఓ ట్వీట్‌లో బీసీసీఐ వెల్ల‌డించింది. ఆగ‌స్ట్ 4న ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్ట్ కోసం పంత్ అందుబాటులో ఉండ‌నున్నాడు.
 
అయితే పంత్ టీమ్‌తో చేరినా.. మ‌రో వికెట్ కీప‌ర్ వృద్ధిమాన్ సాహాతోపాటు అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్‌, బౌలింగ్ కోచ్ భ‌ర‌త్ అరుణ్ ఇంకా ఐసోలేష‌న్‌లోనే ఉన్నారు. ఇద్ద‌రు వికెట్ కీప‌ర్లు ఐసోలేష‌న్‌లో ఉండటంతో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా కేఎల్ రాహుల్‌కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు