భేటీ బచావో: సచిన్ బాటలో ధావన్.. ఇద్దరు కుమార్తెలతో శిఖర్ ఫోటో

శనివారం, 4 జులై 2015 (18:21 IST)
ప్రధాని నరేంద్ర మోడీ మద్దతు తెలిపిన 'భేటీ బచావో'కు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుమార్తె సారాతో సెల్ఫీ దిగి ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా పయనించాడు. తన ఇద్దరు కుమార్తెలను ఈ ప్రోగ్రామ్ ద్వారా బాహ్య ప్రపంచానికి తొలిసారి చూపించాడు. 
 
ప్రైవేటు కార్యక్రమాల్లో తన ఇద్దరు కుమార్తెల గురించి భావోద్వేగంతో మాట్లాడే శిఖర్ ధావన్, ఐపీఎల్ సందర్భంగా తన కుమారుడిని ప్రపంచానికి చూపించాడు. తాజాగా భేటీ బచావో కోసం ఇద్దరు కుమార్తెలతో ఫోటో దిగి పంపించాడు. ఆ ఫోటోకు 'డాడీస్ గర్ల్స్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ ఫోటోకు మంచి ఆదరణ లభిస్తోంది.

వెబ్దునియా పై చదవండి