క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వినాయక చవితి సందర్భంగా సోమవారం తన అభిమానులకు ఓ పరీక్ష పెట్టాడు. వినాయక చవితి సందర్భంగా సచిన్ తన నివాసంలో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఈ ప్రత్యేక పూజలకు అతిరథ మహరాజులు కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా గణేశ్ విగ్రహం ముందు కూర్చుని ప్రార్థిస్తున్న ఓ వ్యక్తి చిత్రాన్నితన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి, ఎవరొచ్చారో కనుక్కోండంటూ అభిమానులను సచిన్ ప్రశ్నించారు.
దీనికి స్పందించిన వేలాది మంది అభిమానులు ఫెదరర్ అని, పాంటింగ్ అని, బ్రెట్ లీ అని ఎవరికి తోచిన సమాధానాలు ఇస్తున్నారు. ఆ సస్పెన్స్ను తానే తొలగిస్తూ, పూజలు చేసింది ఎవరో కాదు దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్ అని వెల్లడిస్తూ, యువరాజ్, జాంటీలతో కలసి దిగిన చిత్రాన్ని పోస్ట్ చేశారు. అతనికి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలంటే ఎంతో గౌరవం ప్రీతి అని తెలిపారు.