కొలంబోలోని సారా ఓవర్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్కు చివరి రోజు సోమవారం కావడంతో విజయం ఇరు జట్లను దోబూచులాడుతోంది. ఈ టెస్ట్లో ప్రస్తుతానికి టీమిండియా పట్టుసాధించినట్టుగానే కనిపిస్తోంది. కోహ్లీ సేన తన రెండో ఇన్నింగ్స్లో 325/8 పరుగలకే డిక్లేర్ చేసి 412 పరుగుల భారీ లక్ష్యాన్ని లంకేయుల ముందు ఉంచింది.
ఆ తర్వాత భారీ విజయలక్ష్యంతో నాలుగో చివరి సెషన్లో బ్యాటింగ్కు దిగిన శ్రీలంక జట్టు రెండు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. దీంతో లంక జట్టు విజయానికి 341 పరుగుల దూరంలోనూ, భారత జట్టు విజయానికి మరో ఎనిమిది వికెట్ల దూరంలో ఉన్నాయి. ఈ మ్యాచ్లో అందివచ్చిన అవకాశం ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోరాదన్న పట్టుదలతో టీమిండియా కుర్రాళ్లు దూకుడును ప్రదర్శిస్తున్నారు. దీంతో చివరి రోజైన సోమవారం మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగనుంది.