ఉధంపూర్ ఘటన, దావూద్ పాకిస్థాన్లోనే ఆశ్రయం పొందుతున్నాడనే విషయం తెలియరావడంతో భారత్-పాకిస్థాన్ సిరీస్ నిర్వహణపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. డిసెంబరులో దాయాదుల మధ్య క్రికెట్ సిరీస్ జరగాల్సి ఉంది. అయితే టెర్రరిజం, సరిహద్దు కాల్పులు, దావూద్ ఇబ్రహీంకు ఆశ్రయం వంటి ఇతరత్రా అంశాల కారణంగా పాకిస్థాన్ తీరును భారత్ తప్పుబట్టినప్పటికీ పాక్ ఏ తప్పూ చేయలేదని బుకాయిస్తుంది.
భారత రాజకీయ నేతలు చేసే ప్రకటనలకు కానీ, మీడియాలో వచ్చే కథనాలను కానీ తీవ్రంగా పరిగణించాల్సిన పనిలేదని, భారత్-పాక్ల మధ్య ఇలాంటి గొడవలు సర్వసాధారణమని.. సిరీస్ రద్దు చేయాల్సి వచ్చేంత స్థాయిలో పరిస్థితులు లేవని సేథీ చెప్తున్నారు.