శక్తిమేర పోరాడిన టీమిండియా... సాక్షి ప్రశంస..!

శుక్రవారం, 27 మార్చి 2015 (14:59 IST)
ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా ప్రదర్శనపై భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి ప్రశంసలు కురిపించింది. టీమిండియా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. టీమిండియా నిష్క్రమణపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
అయితే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్ ధోనీ మాత్రం టీమిండియా పోరాట పటిమను ఆకాశానికెత్తేసింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలను పోస్ట్ చేసింది. ‘‘శక్తిమేర పోరాడారు. చాలా గర్వంగా ఉంది. కొన్ని మ్యాచ్‌ల్లో గెలిస్తే, కొన్నింటిలో ఓడిపోతుంటాం. ఏదేమైనా ఎట్టకేలకు నా భర్తను చూడబోతున్నా’’ అంటూ ఆమె ట్వీట్ చేసింది.
 
కాగా ధోనీ సతీమణి సాక్షి ఇటీవల ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ పాపను కూడా చూసేందుకు ధోనీ రాలేదు. వరల్డ్ కప్ కోసం విదేశాల్లోనే ఉండిపోయాడు. ఈ నేపథ్యంలో సాక్షి తన భర్తను చూడబోతున్నానని హర్షం వ్యక్తం చేసింది. పాప కోసం ధోనీ కూడా ఆత్రుతగా ఇంటిదారి పట్టాడు. అయితే టీమిండియా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడం చాలా నిరాశపరిచిందని ధోనీ వ్యాఖ్యానించాడు. 

వెబ్దునియా పై చదవండి