గుండెనొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో కుప్పకూలిన రాహుల్ సావంత్ అనే క్రికెటర్ను ఆస్పత్రికి తరలించారు. క్రికెట్ మైదానంలో ఆటగాళ్లు ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొంటున్న ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో.. తాజాగా, ముంబైలోని ఆజాద్ మైదాన్లో క్లబ్ క్రికెట్ ఆడుతున్న రాహుల్ సావంత్ అనే ఆటగాడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు.