టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యంపై ప్రస్తుతం పెద్ద చర్చ సాగుతోంది. జట్టుకు వరుసగా పరాజయాలు, వ్యక్తిగతంగా విఫలమవుతున్న నేపథ్యంలో ధోనీ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ పెరిగిపోతోంది. ఇప్పటికే టెస్టు కెరీర్ ను ముగించిన అతడు త్వరలోనే మిగిలిన రెండు ఫార్మాట్లకూ వీడ్కోలు పలకక తప్పదన్న వాదన వినిపించింది.