ఎప్పుడూ ఒకే స్థానంలో బ్యాటింగ్ చేయలేం: కోహ్లీతో ధోనీ

శుక్రవారం, 30 జనవరి 2015 (10:59 IST)
ఎప్పుడూ ఒకే స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకోవడం సరికాదని విరాట్ కోహ్లీకి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు. జట్టు ప్రయోజనాల కోసం కొన్నిసార్లు త్యాగాలు చేయాల్సి ఉంటుందని హితవు పలికాడు. త్వరలో వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు జరగనున్న నేపథ్యంలో కోహ్లీ బ్యాటింగ్ పొజిషన్‌పై ప్రశ్నలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. 
 
"తుది జట్టులో ఉండే 11 మందిలో ఎవరు ఎక్కడ ఆడినా, జట్టుకు లాభం కలగడం ముఖ్యం. అందువల్ల తనకు నచ్చిన స్థానంలో ఆడుతున్న ఆటగాడు ఒక్కోసారి త్యాగం చేయాల్సిరావచ్చు" అని ధోనీ అన్నాడు. 
 
కాగా, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన కోహ్లీ, వన్డే సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లలో కేవలం 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో, కోహ్లీ పొజిషన్ మారుస్తూ ఉండటంపై విమర్శలు పెరుగుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి