ఐసీసీ వన్డే క్రికెట్ ర్యాంకుల్లో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంకులు దిగజారాయి. కోహ్లీ ఒక స్థానం కోల్పోయి నాలుగో స్థానంలో ఉండగా, ధోనీ రెండు స్థానాలు దిగజారి 10వ ర్యాంకులో ఉన్నారు. అయితే, దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలీర్స్ అగ్రస్థానంలో, సంగక్కర రెండు, ఆమ్లా మూడో ర్యాంకులో కొనసాగుతున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్లో బంతితో అద్భుతంగా రాణిస్తున్న భారత పేసర్ మహ్మద్ షమీ, స్పిన్నర్ అశ్విన్లు మాత్రం ర్యాంకులు మెరుగుపరుచుకున్నారు. ప్రస్తుతం షమీ 14 స్థానాలు మెరుగుపరుచుకుని 11వ స్థానానికి చేరుకోగా, స్పిన్నర్ అశ్విన్ 6 స్థానాలు మెరుగుపరుచుకుని 16వ ర్యాంక్కు చేరుకున్నాడు.