విరాట్ కోహ్లి ఔట్... భారత్ స్కోరు 63/3

శుక్రవారం, 6 మార్చి 2015 (17:23 IST)
ప్రపంచకప్ గ్రూప్-బీలో భాగంగా పెర్త్‌లో జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండీస్ నిర్దేశించిన 183 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ తడబడుతోంది. కోహ్లి కాస్త నిలదొక్కుకున్నట్లు కనిపించినట్లే కనిపించి 33 పరుగుల వద్ద తన వికెట్ పారేసుకున్నాడు. దీంతో 15 ఓవర్లకు భారత్ స్కోరు 63/3గా ఉంది. సురేష్ రైనా(0), రహానే 9 పరుగులతో క్రీజులో ఆడుతున్నారు.
 
అంతకుముందు ఓపెనర్లు 2 వికెట్లను కోల్పోయిన భారత్, కేవలం 20 పరుగులకే ఓపెనర్లు శిఖర్ ధావన్(9), రోహిత్ శర్మ(7) అవుటై వెనుదిరిగారు. టేలర్ వీరిద్దరి వికెట్లు తీశాడు.

వెబ్దునియా పై చదవండి