స్పోర్ట్స్ జర్నలిస్ట్పై నోరు పారేసుకున్న టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది. జట్టు పరువు, ప్రతిష్ఠలు పెంచే రీతిలో ప్రవర్తించాలే తప్ప ఇలాంటి వివాదాల జోలికి వెళ్లకూడదని బీసీసీఐ పేర్కొంది. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా మసలుకోవాలని సూచించింది.