ఆస్ట్రేలియాపై పాక్ గెలవాలి.. టీమిండియా చేతిలో ఓడాలి: సర్వే

శుక్రవారం, 20 మార్చి 2015 (11:24 IST)
అడిలైడ్‌లో పాకిస్థాన్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిలుస్తుందని టీమిండియా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వరల్డ్ కప్ సందర్భంగా సోషల్ మీడియాలో క్రికెట్ పోటీల్లో విజేతలు ఎవరు అంటూ పలు సంస్థలు అభిప్రాయాలు సేకరించి, సర్వేలుగా విడుదల చేస్తున్నాయి 
 
ఈ సర్వేలో టీమిండియా అభిమానులు పాకిస్థాన్ విజయం సాధిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సెమీస్‌లో పాకిస్థాన్ మనకు ప్రత్యర్థిగా వస్తే, టీమిండియా మరోసారి పాక్‌ను ఓడిస్తే ఆ మజాయే వేరని అభిమానులు పేర్కొంటున్నారు. ఆ మజా అనుభవించడానికైనా పాక్ విజయం సాధించాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో విజయం మాత్రం ఆస్ట్రేలియాదేనని ఢంకాబజాయించి చెబుతున్నారు.
 

వెబ్దునియా పై చదవండి