ఎవరెన్ని కథనాలు రాసినా, రాయకపోయినా... టీమిండియా విజయం మాత్రం ఖాయమని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనాలను ఆయన మ్యాచ్ విన్నర్లుగా అభివర్ణించారు.
మరోవైపు భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు హర్భజన్ సింగ్, వరల్డ్ కప్కు వెళ్లిన టీమిండియా జట్టు కూర్పుపై సంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులో సరైన ఆటగాళ్లే ఉన్నారన్న అతడు, జట్టులోని సభ్యులంతా సత్తా గలవారేనని వ్యాఖ్యానించాడు. ఈసారి వరల్డ్ కప్ కూడా భారత్ దేనని భజ్జీ తెలిపాడు.