క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా బౌలర్ వేసిన బంతి తగిలి ఓ క్రికెటర్ మరణించాడు. ఈ ఘటన జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని అనంత్నాగ్ పట్టణంలో చోటుచేసుకుంది. జమ్మూకాశ్మీర్ యువజన సర్వీసులు, క్రీడల శాఖ అనంత్ నాగ్ పట్ణణంలో బారాముల్లా, బుద్గాం జిల్లా జట్ట మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించింది.