తమ జట్టు మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినట్టు వస్తున్న వార్తలు నిజమైతే కెప్టెన్సీతో పాటు... జట్టు నుంచి కూడా తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ యూనిస్ ఖాన్ స్పష్టం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో తమ జట్టు ఫిక్సింగ్కు పాల్పడినట్టు వస్తున్న ఆరోపణల్లో అణు మాత్రం నిజం లేదని యూనిస్ అన్నాడు.
ఈ తాజా పరిణామాలపై యూనిస్ కరాచీలో మీడియాతో మాట్లాడుతూ.. సెమీ ఫైనల్ మ్యాచ్లో కివీస్ బ్యాట్స్మెన్ ఇలియట్ ఇచ్చిన సులభమైన క్యాచ్ను వదిలి వేయడానికి చేతి వేలికి తగిలిన గాయమే ప్రధాన కారణమన్నారు.
అయితే, ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు ప్రదర్శనపై వివరణ ఇవ్వాలని కోరుతూ పార్లమెంట్ కమిటీ సమన్లు జారీ చేసిందని, ఈ కమిటీ ఎదుటు హాజరు కావాలా లేదా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని యూనిస్ ఖాన్ చెప్పాడు.