ఆస్ట్రేలియా సిరీస్‌ కోసం అంతమంది సీనియర్లా : బోర్డర్

శుక్రవారం, 3 అక్టోబరు 2008 (15:04 IST)
టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో ఆడేందుకు భారత్ ఐదుగురు సీనియర్లకు అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయం కాదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో భారత సెలక్టర్లు యువతకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే బాగుండేదని ఆయన పేర్కొన్నారు.

ఈ విషయమై బోర్డర్ మాట్లడుతూ ఆస్ట్రేలియా జట్టుతో భారత జట్టును పోల్చి చూస్తే పాతదిలాగా అనిపిస్తోందన్నారు. ఆస్ట్రేలియాతో ఆడేటప్పుడు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు కావాలని భారత సెలెక్టర్లు కోరుకోవడం వల్లే ఇలా ఎంపికచేసి ఉంటారని ఆయన అన్నారు.

అయితే ఎలా చూచినా భారత సెలక్టర్ల ఎంపిక సరికాదని ఆయన అన్నారు. అదేసమయంలో సీనియర్లు గౌరవంగా రిటైర్ అయ్యేందుకు సెలక్టర్లు బహుశా ఈ అవకాశం ఇచ్చి ఉండవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి