ఆ ముగ్గురికి ప్రత్యామ్నాయం చాలా కష్టం: మోషిన్ ఖాన్

స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో చిక్కుకుని అంతర్జాతీయ క్రికెట్ మండలి సస్పెన్షన్‌కు గురైన క్రికెటర్లు సల్మాన్ భట్, మొహ్మద్ అమిర్, మొహ్మద్ ఆసిఫ్‌ల స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయడం చాలా కష్టమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలక్టర్ మోషిన్ ఖాన్ అభిప్రాయపడ్డారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై ఐసీసీ చర్యపై సమాధానం ఇవ్వాలని ఈ ముగ్గురికి సెప్టెంబరు రెండో తేదీన నోటీసు జారీ చేసినట్టు చెప్పారు. ఇందుకు రెండు వారాల గడువు విధించినట్టు తెలిపారు. ఈ గడువును క్రికెటర్ల విజ్ఞప్తి మేరకు పొడగించినట్టు ఆయన తెలిపారు.

అయితే, ఈ ముగ్గురు క్రికెటర్లు కొంతకాలం జట్టుకు దూరమయ్యారు. వీరి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయడం తమకు కష్టంగా మారిందని ఆయన అంటున్నారు. ముఖ్యంగా, ఈ నెలలో దక్షిణాఫ్రికా జట్టుతో ప్రారంభమయ్యే టెస్టు, వన్డే సిరీస్‌లకు ఈ ముగ్గురు ఆటగాళ్ల స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయడం ఎంతో ప్రయాసగా మారిందన్నారు.

వెబ్దునియా పై చదవండి