ఇంగ్లాండ్‌తో ధోనీసేనకు గట్టి ప్రతిఘటన తప్పదు: పొల్లాక్

యాషెస్ సిరీస్‌లో అద్భుత ఆటతీరును ప్రదర్శించి ప్రపంచ అగ్రగామి క్రికెట్ జట్టుగా ఎదిగేందుకు సన్నద్ధమవుతున్న ఇంగ్లాండ్‌తో భారత్‌కు గట్టి ప్రతిఘటన తప్పదని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొల్లాక్ అభిప్రాయపడ్డాడు. యాషెస్ సిరీస్‌లో అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తున్న ఇంగ్లాండ్‌, ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఉన్న భారత్‌ను సవాలు చేయడానికి సిద్ధంగా ఉందని పొల్లాక్ అన్నాడు.

ఇంగ్లాండ్ పటిష్టమైన ఆటగాళ్లతో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లలో ధీటుగా రాణిస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారని పొల్లాక్ గుర్తు చేశాడు.

యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ ఆటతీరును చూశాక నెంబర్ వన్ స్థానంలో ఉన్న భారత్‌కు బ్రిటీష్ జట్టు నుంచి ముప్పు పొంచి ఉందని పొల్లాక్ అన్నాడు. అందుచేత ఇంగ్లాండ్ ఇదే ఆటతీరును దీర్ఘకాలం కొనసాగించాల్సి ఉందని పొల్లాక్ చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి