ఎయిర్‌టెల్ చాంపియన్స్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా "బిగ్ బీ"

దక్షిణ ఆఫ్రికాలో జరగనున్న ఎయిర్‌టెల్ ఛాంపియన్ లీగ్ ట్వెంటీ-20కు బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ "అమితాబ్ బచ్చన్‌"ను ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ ఎన్నకుంది. "ఈ కార్యక్రమం ఇప్పుడు మరింత ప్రత్యేకంగా మారనుంది. త్వరలో టీ-20 జట్లకు జరగనున్న టీ-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిచనున్నారని" ఈఎస్‌పీఎన్ స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ మేనేజింగ్ డెరెక్టర్ మను సాహ్నే అన్నారు.

అంతే కాకుండా టీమ్ ఇండియా మాజీ కెప్టన్ సౌరవ్ గంగూలీ కామెంటేటర్ టీమ్‌లో సభ్యుడుగా వ్యవహరించనున్నట్లు మను సాహ్నే తెలిపారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ మాట్లాడుతూ తాను క్రికెట్‌కు వీరీభిమానిని, తన కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ కలిసి తన ఇంట్లో క్రికెట్ చూస్తారని అన్నారు. అంతే కాకుండా తనలో ఉన్న క్రికెటర్‌ గురించి కూడా ఈ సందర్బంగా అమితాబ్ ప్రస్తావించాడు. తను యుక్త వయస్సులో ఉన్నపుడు ఎడమ చేతితో బైలింగ్, కుడి చేతితో బ్యాటింగ్ చేసే వాడినని ఆయన తెలిపారు. ఈఎస్‌పీఎన్ ఛానెల్ కనుక ఆహ్వానిస్తే దక్షిణ ఆఫ్రికాకు వెళ్లి ప్రత్యక్షంగా మ్యాచ్‌లను తిలకిస్తానని కూడా ఆయన అన్నారు.

వెబ్దునియా పై చదవండి