ఏమి జరుగుతుందో నాకు అర్థం కావట్లం లేదు: యువీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌‌లో పుణే వారియర్స్ వరుస ఓటములకు కారణమేమిటో నాకు అర్థం కావటం లేదని ఆ జట్టు సారథి యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు. ఈ సీజన్‌లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన పుణే జట్టు వరుసగా ఏడు పరాజయాలు మూటగట్టుకోవడంతో సెమీస్‌కు చేరటం ఇక అసాధ్యం.

పుణే బుధవారం ముంబాయిపై 21 పరుగుల తేడాతో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో యువరాజ్‌కి సంతృప్తినిచ్చిన విషయాలు ఫామ్‌లో ఉన్న ముంబాయి సారథి సచిన్‌ను అవుట్ చేయటం, లెగ్ స్పిన్నర్ రాహుల్ శర్మ నాలుగు ఓవర్లలో ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసుకోవటం మాత్రమే. మేము చాలా బంతులకు పరుగులు చేయలేకపోయాం, మాకు మ్యాచ్‌ని ఫినిష్ చేసే పవర్ హిట్టర్‌లు కావాలని యువీ అన్నాడు.

వెబ్దునియా పై చదవండి