ఐపీఎల్‌ టోర్నీకి అందుబాటులో ఆసీస్ ఆటగాళ్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2లోని తొలి అంచె పోటీలకు దూరమైన ఆస్ట్రేలియా అగ్రశ్రేణి ఆటగాళ్లు బ్రెట్ లీ, ఆండ్రూ సైమండ్స్, షేన్ వాట్సన్‌లు తదుపరి ఐపీఎల్ మ్యాచ్‌లకు అందుబాటులోకి రానున్నారు. కింగ్స్ లెవెన్ పంజాబ్‌తో శనివారం జరిగే మ్యాచ్‌లో దక్కన్ ఛార్జర్స్ జట్టు తరపున సైమో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

అలాగే, గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టు సేవలకు దూరమైన బ్రెట్ లీ, మరో బౌలర్ షేన్ వాట్సన్‌, హోప్స్, బ్రాకెన్, డేవిడ్ హస్సీ తదితర ఆసీస్ ఆటగాళ్లు అందుబాటులోకి రానున్నారు. వచ్చే జూన్ నెలలో ఇంగ్లండ్ గడ్డపై జరుగనున్న ట్వంటీ-20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన ఆసీస్ జట్టులో లీ, సైమో, వాట్సన్‌లకు చోటు దక్కిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో ఇటీవలే పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పాల్గొనడం వల్ల పరువురు ఆసీస్ క్రికెటర్లు ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యారు. పాక్-ఆసీస్ జట్ల మధ్య జరిగే ఏకైక ట్వంటీ-20 మ్యాచ్ శుక్రవారంతో ముగిసింది. దీంతో వీరంతా ఐపీఎల్ టోర్నీకి అందుబాటులోకి వచ్చారు.

వెబ్దునియా పై చదవండి