ఐపీఎల్-5: ముంబై ఇండియన్స్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్..!?

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సమరం ఏప్రిల్ ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, గత ఏడాది రన్నరప్ జట్టు ముంబై ఇండియన్స్‌కు ప్రస్తుత టీమిండియా కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌ను కోచ్‌గా నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

టీమిండియా జట్టు సభ్యులు ప్రపంచకప్ గెలిచేలా శిక్షణ ఇచ్చిన కిర్‌స్టెన్, ముంబై ఇండియన్స్‌కు సైతం సేవలందించే దిశగా సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కానీ వచ్చే ఏడాది నుంచి ముంబై ఇండియన్స్‌కు గ్యారీ కిర్‌స్టెన్ కోచ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టుకు మాజీ దక్షిణాఫ్రికా పేసర్ షాన్ పొలాక్‌ను కోచ్‌గా నియమించడం జరిగింది. తద్వారా వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ ఐదో సీజన్‌లో ఆడే ముంబై ఇండియన్స్ జట్టుకు గ్యారీ కిర్‌స్టన్ కోచ్‌గా ఎంపికయ్యే అవకాశం ఉందని సమాచారం.

వెబ్దునియా పై చదవండి