కెప్టెన్ ధోనీ ఒబామా ఆఫ్ క్రికెట్: ప్రవీణ్ కుమార్ కితాబు

మంగళవారం, 1 ఫిబ్రవరి 2011 (17:48 IST)
FILE
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ "ఒబామా ఆఫ్ క్రికెట్" అని భారత ఆల్‌రౌండర్ ప్రవీణ్ కుమార్ కితాబిచ్చాడు. మహేంద్ర సింగ్ ధోనీలో కెప్టెన్సీ నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ప్రవీణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అంతేగాకుండా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ధోనీని ప్రవీణ్ కుమార్ పోల్చాడు.

నల్లజాతీయుడైన ఒబామా అమెరికాకు అధ్యక్షుడు కాగా, కెప్టెన్ ధోనీ స్ఫూర్తిదాయక నాయకుడు అని కొనియాడాడు. ధోనీ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు పటిష్టంగా రూపొందిందని, మొత్తానికి ధోనీ ఒబామా ఆఫ్ క్రికెట్ అని ప్రవీణ్ కుమార్ ఆకాశానికి ఎత్తేశాడు.

కాగా, 24 ఏళ్ల ఆల్‌రౌండర్ ప్రవీణ్ కుమార్ సొంత గడ్డపై తొలిసారి వన్డే ప్రపంచకప్‌లో ఆడుతున్నాడు. ఈ విషయమై ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ, వన్డే ప్రపంచకప్‌లో తాను ఆడనుండటం కలలోనే ఉన్నానని చెప్పాడు. ప్రపంచకప్ సాధారణ టోర్నీ కాదని, ఇంకా సొంతగడ్డపై ఆడటం ఎంతో సంతోషంగా ఉందన్నాడు.

వెబ్దునియా పై చదవండి