కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై షాహిద్ అఫ్రిది ప్రశంసల జల్లు!

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై పాకిస్థాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ జట్టుకు సంబంధించి మూడు ఫార్మాట్‌లకు ఒకే నాయకుడిగా మహేంద్ర సింగ్ ధోనీ వ్యవహరించడం టీమిండియాకు అదృష్టమన్నాడు. భారతీయులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కిన షాహిద్ అఫ్రిది, ధోనీని ప్రశంసలతో ముంచెత్తాడు.

ఇంకా భారత ప్రజలు, సచిన్ టెండూల్కర్‌లను కూడా అఫ్రిది కొనియాడాడు. ప్రపంచకప్ ఫైనల్లో మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ప్రపంచకప్ ఫైనల్లో గెలుపును నమోదు చేసుకోగలిగే సత్తా కలదని టీమిండియా నిరూపించుకుంది. ఇంకా భారత ఉపఖండంలో జరిగిన ప్రపంచకప్ విజయవంతమైందని అఫ్రిది వ్యాఖ్యానించాడు.

తానెప్పుడూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ ఆటను ఆస్వాదిస్తాను. సచిన్ సంతకం చేసిన బ్యాట్‌ను తన రిసెప్షన్‌ రూమ్‌లో పెట్టాను. మూడుపదులు వయస్సైనా క్రికెట్‌పై సచిన్‌కు ఉన్న పట్టుదల, ఆయనపై అభిమానులకు గల ప్రేమను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని సచిన్ పేర్కొన్నాడు.

వెబ్దునియా పై చదవండి